టాలీవుడ్ లో రూపొందుతున్న క్రేజీ మల్టి స్టారర్ చిత్రం గోపాల గోపాల . విక్టరీ వెంకటేష్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తీ కావొచ్చింది . డాలి దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కు ప్లాన్ చేస్తున్నారు . అయితే ఈ సినిమాకు సంబందించిన సాటిలైట్ హక్కులను భారిగా జెమినీ టివి తీసుకున్నట్టు సమాచారం . ఈ హక్కులు భారిగా అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది . ఈ సినిమాతో పాటు దృశ్యం . భీమవరం బుల్లోడు . సినిమాలకు కలిసి దాదాపు 20 కోట్లకు తీసుకున్నట్టు తెలుస్తోంది . అంటే ఈ సినిమాకు దాదాపు పన్నెండు నుండి పదిహేను కోట్లు గోపాలా గోపాల సినిమాకు వెచ్చించినట్టు తెలుస్తోంది . మరి ఈ సినిమా విడుదలై మరిన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి
Recent Comments