నేడు సచిన్‌తో ఆస్ట్రేలియా ప్రధాని సమావేశం

imagesన్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోని అబాట్ గురువారం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో సమావేశం కానున్నారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన మొదట సచిన్‌తో భేటీ కానుండడం విశేషం. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా జరిగే కార్యక్రమంలో అబాట్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, బ్రెట్‌లీ సచిన్‌ను కలుస్తారని విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ భట్టాచార్య చెప్పారు. భారత పర్యటనలో భాగంగా క్రీడా రంగానికి సంబంధించి అవగాహన ఒప్పందంపై అబాట్ సంతకం చేయనున్నారు.

Leave a Comment